శుక్రవారం తెల్లవారుజామున మాల్దీవులలోని వాయు అటోల్లో జరిగిన పడవ ప్రమాదంలో ఇద్దరు ప్రముఖులు అదృశ్యమయ్యారు. ఏడుగురు ప్రయాణిస్తున్న స్పీడ్బోట్ బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.
మాల్దీవులలోని ఫెలిదూ దీవుల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్న స్పీడ్బోట్ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రమాదానికి గురైన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్ గ్రూప్ MD గౌతమ్ సింఘానియా, మోటార్స్పోర్ట్ దిగ్గజం హరి సింగ్, మరియు మాజీ నేవీ అధికారి కమాండర్ మహేష్ రామచంద్రన్ ఉన్నారు. ఈ సంఘటనతో వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, హరి సింగ్ మరియు కమాండర్ మహేష్ రామచంద్రన్ జాడ తెలియరాలేదు. వీరిద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.











