ఈ కేటగిరీలో తాజా వార్తలు

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రోగ్రాం కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువతతో వర్చువల్గా సంభాషించారు.

కామారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి యువత క్రియాశీలకంగా పనిచేయాలని పార్టీ అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు ఆదిల్, శనివారం రాత్రి హైదరాబాద్లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవితను మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని యువత సమస్యలపై చర్చించారు.

జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి రాష్ట్ర స్థాయి ప్రముఖులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా, ఆయన పలువురు కీలక నాయకులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా ఆయన వారిని కోరారు.

జిల్లాలో ట్రాఫిక్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కామారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ నవీకరించిన ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్ గారు శని వారం నాడు ఫీల్డ్ విజిట్ లో భాగంగా జిల్లా రవాణా కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ అధికారులను, సిబ్బంది నీ ఉద్దేశించి తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. కార్యాలయం అంతటా పరిశీలించి ఆవరణ లో మొక్క నీ నాటారు.

అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సివిల్ ఇంజనీర్ బట్టు భవాని శంకర్ తమ పాస్పోర్ట్ పోగొట్టుకున్నట్లు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదాశివనగర్ సబ్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పాస్పోర్ట్ నంబర్ 259330ను మార్చి 28న పనిమీద వస్తున్న సమయంలో పోగొట్టుకున్నట్లు తెలిపారు.

ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక HP ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లలో వచ్చే అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

తనకు ఇల్లు లేదని, బైపాస్ పక్కన ఉన్న చిన్న గుడిసెలోనే వంట చేసుకుని, పడుకుంటున్నానని, ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కామారెడ్డి పట్టణానికి చెందిన అన్నేపల్లి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు స్థలం ఉన్నప్పటికీ, మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదని, రెండో విడతలోనైనా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీని ఆయన కోరారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ మరియు ‘మై భారత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆర్.కే. డిగ్రీ & పీజీ కళాశాల వేదికగా జరిగిన ఈ పోటీల్లో వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా స్థాయి విజేతలు తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనిధి కళాశాలలో నూతన పీజీ కోర్సులు ప్రారంభమయ్యాయి. 2026-2027 విద్యా సంవత్సరానికి M.SC జూలోజి, M.A ఇంగ్లీష్ కోర్సులకు అనుమతి లభించిందని కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి తెలిపారు. ఈ కోర్సులు విద్యార్థుల నైపుణ్యాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని ఆయన పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ L. మల్లికార్జున్ గారు ఈరోజు జడ్.పి.హెచ్.ఎస్ కృష్ణాజివాడి, ఎంపీపీ ఎస్ కృష్ణాజివాడి పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారిని ప్రోత్సహించే దిశగా సూచనలు చేశారు. ఈ తనిఖీలలో పలువురు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

మరెడ్డి జిల్ల ేంద్రంలోని ప్రభుత్వ వైద్యశలలో చిిత్స పొందుతున్న ఇందిర (22) అనే మహిళు ఓ నెగిటివ్ ర్తం అవసరమైంది. ర్తనిధి ేంద్రలలో ఆ ర్తం లభించపోవడంతో, వరి ుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవదళ్ రష్ట్ర చైర్మన్, రెడ్ ్రస్ జిల్ల సమన్వయర్త డ్టర్ బలును సంప్రదించరు. వెంటనే స్పందించిన రిజర్వ్డ్ ఎస్సై సయి ప్రసన్న, రెయిన్బో ర్తనిధి ేంద్రంలో ర్తన్ని అందజేసి మహిళ ప్రణలు పడరు.

దోమకొండ పరిధిలో ఆత్మహత్యకు యత్నించిన ఒక మహిళ ప్రాణాన్ని పోలీసులు చాకచక్యంగా కాపాడారు. డయల్-100కు అందిన సమాచారం మేరకు వెంటనే స్పందించి, సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గంగయ్య, కానిస్టేబుల్ రాజులను జిల్లా ఎస్పీ అభినందించారు.

యువతలో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ‘మై భారత్’ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి (DYO) రమేష్, ఆర్.కే. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి తెలిపారు. రేపు (జూలై 31) ఆర్.కే. డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో 'వి బి జి రామ్ జి' పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా వారికి వేతనాలు అందకపోవడంతో, పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, సకాలంలో వేతనాలు అందేలా చూడాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిట్లం ఎస్సై బి. ఆంజనేయులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రదేశాల్లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.

కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "ఆపరేషన్ కవచ్" కార్యక్రమం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో నేరాలు జరగకముందే వాటిని అరికట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గంజాయి స్వాధీనం, వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు వంటి అంశాల్లో విశేష ఫలితాలు సాధించారు.

కామారెడ్డి పట్టణంలో కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా రోడ్లపై నివసిస్తున్న నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సైన్య సేన సంస్థ మానవత్వాన్ని చాటుతూ వారికి ఉచితంగా వేడి భోజనాన్ని పంపిణీ చేసింది. ఉపాధి కోల్పోయినవారికి పోషకాహారం అందించి ఆదుకున్నారు.

కమెడడిిలలపోలీసుసూపిటెడెట,ఐపీఎసబుధవసశివనగపోలీససటననుఆకసమికగతనిఖీశుఈసభగపోలీససటననివహణ,ికడులు,సిబబితోసమవశమైపలుకీలకసూనలుశుపిశుభత,సమథవతమైనపోలీసిగ,పసవవటిఅశలపైఆనృటిసిు