కామారెడ్డి, 2026-07-27
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐ.ఎస్.ఆర్.డి (ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కామారెడ్డి) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్సిల్, ఎరేజర్ కిట్స్ పంపిణీ చేశారు. భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐ.ఎస్.ఆర్.డి (ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కామారెడ్డి) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్సిల్, ఎరేజర్ కిట్స్ పంపిణీ చేశారు. ఐ.ఎస్.ఆర్.డి అధ్యక్షురాలు రవళి, సీఈఓ రాజేందర్ (లింగంపల్లి గ్రామస్తులు)ల సహకారంతో భూంపల్లి ఉన్నత పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు రవళి మాట్లాడుతూ, ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తుందని, వారికి ఎలాంటి అవసరం ఉన్నా సంస్థ ఆదుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులోనూ నిరుపేద విద్యార్థుల అవసరాలను సంస్థకు తెలియజేయాలని ఆమె కోరారు.
భూంపల్లి పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, సీఈఓలకు గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ముత్తెన్న, హైమావతి, మాలతి, చింతల లింగంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.











