రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగడం వల్ల చోటుచేసుకున్న విషాద సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రకటన చేశారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాలు సేవించిన నలుగురు వ్యక్తులు మరణించారని, మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీఎం తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.











