ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల నేపథ్యంలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని చైనా పిలుపునిచ్చింది. ఈ దాడుల పట్ల తమ ఆందోళనను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు ఘర్షణలను నివారించాలని, చర్చలు, సంప్రదింపులను పునఃప్రారంభించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చైనా ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకారం, ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క ఉద్దేశ్యాలు, సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక నిబంధనల నుండి వైదొలగడమే అమెరికా సైనిక బలప్రయోగం అని పేర్కొంది.
ఇజ్రాయెల్లోని చైనా రాయబార కార్యాలయం, ఇజ్రాయెల్లో ఉన్న చైనా పౌరులను వీలైనంత త్వరగా దేశంలోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని లేదా తబా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్కు వెళ్లాలని సూచిస్తూ ఒక నోటీసు జారీ చేసింది.
ఇరాన్లో ఉన్న చైనా పౌరులను కూడా వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. అజర్బైజాన్, ఆర్మేనియా, టర్కీ, ఇరాక్ వంటి దేశాలకు వెళ్లే నాలుగు భూ మార్గాలను కూడా సూచించింది.

