రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 11,337 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అధికారిక లెక్కల ప్రకారం, మొత్తం 11,337 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 15 జిల్లాల్లో 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లో 1,387 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వరి 2,650 హెక్టార్లలో, మొక్కజొన్న 6,450 హెక్టార్లలో, మినుము 485 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. ఈ నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుపుతున్నారు.











