కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఈరోజు నిరసన ప్రదర్శన చేపట్టారు. 2015 నాటి వేతన సవరణల ప్రకారం ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని, వివక్షతో కూడిన బోనస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ఈ నిరసనలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఈరోజు నిరసన ప్రదర్శన చేపట్టారు. 2015 నాటి వేతన సవరణల భాగంగా ఐదు రోజుల పని దినాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, దశాబ్ద కాలంగా దానిని అమలు చేయలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా సమ్మె నోటీసు ఇచ్చిన కారణంగా, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
వారి ప్రధాన డిమాండ్లలో 2015లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ఒకటి. అలాగే, వివక్షతో కూడిన (వ్యక్తి ఆధారిత బోనస్)ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యక్తి ఆధారిత బోనస్ అధికారులు, ఉద్యోగుల మధ్య తీవ్ర వివక్షకు దారితీస్తుందని ప్రదర్శనలో పాల్గొన్న యూనియన్ల నాయకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి

