కామారెడ్డి జిల్లా వాసికి తెలంగాణ ఐటి అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సామాజిక సేవ పురస్కారం లభించింది.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశేష సేవలు అందించిన కామారెడ్డి జిల్లా వాసికి ఉత్తమ సామాజిక సేవ పురస్కారం లభించింది.
జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ‘డిజిటల్ యాత్ర’ కార్యక్రమాల ద్వారా సాంకేతిక అవగాహన పెంపొందించడం, పేద-మధ్య తరగతి విద్యార్థులకు విద్యా సహాయం అందించడం వంటి సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.
రెండు రోజుల పాటు 150 మంది ఐటీ ఉద్యోగులతో కలిసి 10 వేల మంది విద్యార్థులకు డిజిటల్ శిక్షణ నిర్వహించడంతో పాటు, ప్రపంచ స్థాయి ఐటీ మ్యాగజైన్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం విశేషం.
ఈ పురస్కారాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జాయింట్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా అందజేశారని ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ తెలిపారు.

