అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న జోవెంట్, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన, ఈ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వంలో కలకలం రేపింది.
తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జోవెంట్, ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ కలిగించడం లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మరియు దాని బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి కారణంగానే ఈ యుద్ధం ప్రారంభమైందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అయితే, వైట్ హౌస్ జోవెంట్ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్ అమెరికాపై దాడి చేయబోతోందని తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ పరిణామంతో, ట్రంప్ పరిపాలనలో అత్యంత కీలక పదవిలో ఉంటూ, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడిని బహిరంగంగా విమర్శించిన వారిలో జోవెంట్ ఒకరిగా నిలిచారు.











