Giddaluru, జూన్ 27
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్, ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పర్యటనకు ముందుగా హెలిప్యాడ్ ప్రాంగణం, వీఐపీ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించి భద్రతా చర్యలను సమీక్షించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












