కడప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు అరుదైన క్యాన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించారు. మైదుకూరుకు చెందిన 55 ఏళ్ల మహిళ కడుపులో పెరిగిన 5 కిలోల గడ్డను ఆధునిక సాంకేతికతతో తొలగించారు.
కడప నగరంలోని కడప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. క్యాన్సర్ వైద్యులు డాక్టర్ వంశీ విహారి, స్త్రీ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ సాయి చరిత నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మైదుకూరుకు చెందిన వెంకట రమణమ్మ (55) అనే మహిళ గత ఏడాదిగా కడుపులో క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్నారు. ఆమె కడుపులో సుమారు 34 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న 5 కిలోల గడ్డను ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ తో ఆమెకు ఉపశమనం లభించింది.











