భారత ఐటీ రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను ప్రభావాన్ని చూపనుందని, రాబోయే రెండేళ్లలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని 'సిట్రినీ రీసెర్చ్' సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
అమెరికాకు చెందిన 'సిట్రినీ రీసెర్చ్' సంస్థ 'ద 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్' పేరుతో విడుదల చేసిన నివేదిక, భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలపై ఏఐ ఆటోమేషన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. మానవ మేధస్సుతో పనిలేకుండా ఏఐ చేసే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ పరిణామం భారత ఐటీ ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని, తద్వారా రూపాయి విలువ కూడా దారుణంగా పతనం కావచ్చని నివేదిక అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సహాయం కోరే పరిస్థితి కూడా రావచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.










