భారతదేశానికి చెందిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇజ్రాయెల్లో ఏర్పాటు చేయబోతున్నారు.
ఇజ్రాయెల్, భారతదేశంతో ఉన్న సాంస్కృతిక బంధానికి గుర్తుగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు.
ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్, శివ రాజ్యాభిషేకం దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, "భారతదేశ చరిత్రలో, ప్రజల హృదయాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభావం ఎంతటిదో మాకు బాగా తెలుసు" అని తెలిపారు.
ఈ విగ్రహం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు శివాజీ మహారాజ్ యొక్క జీవిత విశేషాలను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెవాచ్, "ఇజ్రాయెల్లో శివాజీ మహారాజ్ గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంద" అని చెప్పారు.












