జమ్మలమడుగు, జూన్ 29
జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి "ఏరువాక పున్నమి-2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. యువత ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని సూచించారు.
వ్యవసాయాన్ని చులకనగా చూడకూడదని, దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వ్యవసాయ రంగమేనని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. సోమవారం జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి "ఏరువాక పున్నమి-2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి పెంచుకుని ఆధునిక పద్ధతులతో సాగు చేయాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సేవలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పద్ధతులను స్వీకరించి, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దాలని రైతులకు పిలుపునిచ్చారు.












