మంగళగిరిలోని దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు సంబంధించి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో, ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి లోకేష్కు వివరించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు, యాగశాల, గంట మండపం పునర్ నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి మంత్రి లోకేష్ ఆమోదం తెలిపారు. ఈ పనుల ద్వారా ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలు మెరుగుపడతాయి.












