తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కర్ణాటకలోని ఉడుపి జిల్లా, కొల్లూరులో కొలువైన పురాతన మూకాంబికా అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు.
చెన్నై నుంచి మంగళూరు చేరుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొల్లూరులోని మూకాంబికా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం, ఆయన చొక్కా తీసి కండువా ధరించి ఆలయంలోకి ప్రవేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం, గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.












