నంద్యాల, జూన్ 28
నంద్యాల పట్టణంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఎంఎస్ నగర్ లోని సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు.
నంద్యాల పట్టణం మూల సాగరం ప్రాంతం, ఎంఎస్ నగర్ లోని సచివాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తప్పనిసరిగా తీసుకోవాలని తల్లిదండ్రులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలనకు అందరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా ఇమ్యూనెజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు శారద బాయ్, లక్ష్మీ ప్రసన్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.












