కామారెడ్డి, 2026-07-29
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యాచరణ, సంసిద్ధత, ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష కోసం రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ సంచాలకులు డా.రవీందర్ నాయక్ కామారెడ్డి జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు. భిక్నూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడి వైద్యాధికారి డా.ఏమీమా సేవలను ప్రశంసించారు.
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కార్యాచరణ, సంసిద్ధత, ఇతర ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష కోసం రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ సంచాలకులు డా.రవీందర్ నాయక్ కామారెడ్డి జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు.
భిక్నూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి, అక్కడ అందుతున్న సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారి డా.ఏమీమా అందిస్తున్న వైద్య సేవల తీరును ఆయన ప్రశంసించారు.
తరువాత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లా వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, ముందు జాగ్రత్త చర్యలపై ఆయన తగు ఆదేశాలు జారీ చేస్తూ మార్గదర్శనం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా.రాజు, డా.వెంకటస్వామి, డా.రోహిత్, డా.ప్రదీప్, డా.నర్సింగ్ చౌహాన్, ఏ.ఎం.ఓ. శ్రీనివాస్ రెడ్డి, డెమో.మహేందర్ రెడ్డి, హెచ్.ఈ. వేణుగోపాల్ పాల్గొన్నారు.











