11వ రైసినా డైలాగ్ లో ఫిన్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ అలెగ్జాండర్ స్టబ్ కీలక ప్రసంగం చేస్తూ, భవిష్యత్ ప్రపంచ క్రమాన్ని గ్లోబల్ సౌత్ నిర్ణయిస్తుందని, అందులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ముగిసిందని, ప్రపంచ శక్తి సమతుల్యం మారిందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నిన్న న్యూఢిల్లీలో 11వ రైసినా డైలాగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన ఫిన్లాండ్ అధ్యక్షుడు డాక్టర్ అలెగ్జాండర్ స్టబ్, భవిష్యత్ ప్రపంచ క్రమాన్ని గ్లోబల్ సౌత్ నిర్ణయిస్తుందని, అందులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ శక్తి సమతుల్యం మారిందని, గ్లోబల్ సౌత్ కు ఆర్థికంగా, జనాభా పరంగా బలం ఉందని ఆయన అన్నారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ముగిసిందని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన సవాళ్లున్నాయని, క్రియాశీలక ప్రపంచ శక్తి లేకపోతే ఒక శక్తి శూన్యత ఏర్పడుతుందని అధ్యక్షుడు స్టబ్ నొక్కి చెప్పారు. అంతర్జాతీయ నియమాలను దేశాలు విస్మరిస్తే, ప్రస్తుత ప్రపంచ క్రమం కూలిపోతుందని ఆయన హెచ్చరించారు. అసంపూర్ణ ప్రపంచంలో శక్తిని ఎలా నియంత్రించాలో పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన సూచించారు. భారతదేశం తన విదేశాంగ విధానాన్ని వాస్తవిక దృక్పథంతో రూపొందించుకుందని, ఒకే భాగస్వామి దయపై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్త వహించిందని ఆయన అన్నారు.











