ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం నేపథ్యంలో, ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకుంటుందని, తదుపరి నాయకుడి ఎంపికలో తమ పాత్ర ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని తదుపరి నాయకుడిగా అంగీకరించే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. ఆయనను "తేలికపాటి వ్యక్తి"గా అభివర్ణిస్తూ, ఇరాన్ భవిష్యత్తుకు ఆయన సరిపోరని అన్నారు. ఇరాన్ను శాంతి మార్గంలో నడిపించే నాయకుడిని ఎంచుకునే ప్రక్రియలో అమెరికా భాగస్వామ్యం కావాలని, తరచుగా యుద్ధాలు జరగకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వెనిజులాలో డెల్సీ రోడ్రిగ్జ్ నియామకంలో అమెరికా పోషించిన పాత్రను గుర్తుచేస్తూ, ఇరాన్ విషయంలోనూ అదే పంథా అనుసరిస్తామని ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యంపై మరింత చర్చకు దారితీశాయి.











