అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దేశ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లను 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అమెరికా సుప్రీంకోర్టు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలను చట్టవిరుద్ధమని శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ఆరుగురు న్యాయమూర్తులు ట్రంప్ కు వ్యతిరేకంగా, ముగ్గురు అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ట్రంప్ టారిఫ్ లను పెంచారని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కోర్టు తీర్పును ధిక్కరిస్తూ, ట్రంప్ ప్రభుత్వం గతంలో 10 శాతం టారిఫ్ లను పెంచింది. తాజాగా, మరో 5 శాతం పెంచుతూ, మొత్తం టారిఫ్ లను 15 శాతానికి చేర్చినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి ప్రతిస్పందనలు వెలువడే అవకాశం ఉంది.











