బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ 1,000 మంది బాలికల విద్యకు సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. ముంబైలోని లాల్బాగ్చా రాజా మండపాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమాన్ని సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా చేపట్టనున్నారు.
గణేశ్ చతుర్థి సందర్భంగా లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న రణ్వీర్ సింగ్, గత సంవత్సరం తన కుటుంబానికి సంతోషకరంగా గడిచిందని, అందుకు బప్పా ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని చెప్పారు. అనంతరం 1,000 మంది బాలికల చదువుకు తన వంతు సహాయం అందిస్తానని వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇదే కార్యక్రమానికి బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కూడా తమ వంతు సహకారం ప్రకటించారు. దేశంలోని 20 పాఠశాలలను ఆధునీకరించేందుకు, అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు సహకరిస్తామని వీరు వెల్లడించారు.











