2026 ఏషియన్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే దిశగా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీఫైనల్లో ఆదివారం బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ నిస్సిన్లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్లో జరగనుంది.
2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు, ఈసారి కూడా అదే విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఏషియన్ గేమ్స్లో భారత్ వరుసగా రెండోసారి సెమీఫైనల్కు చేరుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జపాన్పై ఘన విజయం
క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య జపాన్పై భారత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన భారత బౌలర్లు జపాన్ను 57 పరుగులకే ఆలౌట్ చేశారు. శ్రీ చరణి అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఐదు ఓవర్లలోనే ఛేదించింది. షఫాలీ వర్మ 15 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేసి భారత విజయాన్ని సులభతరం చేసింది. దీంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో జపాన్ను ఓడించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.










