జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ రుసుమును 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు రాబోయే నెల నుండి అమల్లోకి వస్తాయి.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్తించే ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ రుసుమును ప్రస్తుత 3000 రూపాయల నుండి 3075 రూపాయలకు సవరించింది.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పెరిగిన 75 రూపాయల రుసుము వచ్చే నెల మొదటి తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఈ సవరించిన రేటు, జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్ప్రెస్వేలలోని వెయ్యికి పైగా ఫీజు ప్లాజాలలో వార్షిక పాస్ సౌకర్యాన్ని పొందాలనుకునే అర్హత కలిగిన వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది.
ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్, ఒకేసారి రుసుము చెల్లింపుతో ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యేలా లేదా రెండు వందల టోల్ ప్లాజా క్రాసింగ్లకు వీలు కల్పిస్తుంది. ఇది తరచుగా ఫాస్ట్ట్యాగ్ను రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.










