కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై చంద్రశేఖర్, తన భార్య దివ్య మరణించిన ఐదు రోజుల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో ఉన్నాయి.
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య అనారోగ్యంతో బాధపడుతూ గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణానికి ఎస్సై చంద్రశేఖరే కారణమని దివ్య బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో, బంధువులు చంద్రశేఖర్ పై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
భార్య మరణం, బంధువుల ఆరోపణలతో తీవ్ర మనోవేదనకు గురైన ఎస్సై చంద్రశేఖర్, ఈ సంఘటనల భారాన్ని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో, ఆయన సీతంపేటలోని తన అత్తగారి ఊరికి ఐదవ రోజు కార్యక్రమాలకు హాజరయ్యారు.











