పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్పై బెట్టింగ్, ఆన్లైన్ జూదానికి సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, తనపై వస్తున్న ఆరోపణలపై పూర్తి వివరాలు అందించాలని పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఆయన కోరారు. విచారణపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.
పాకిస్థాన్ క్రికెట్లో బెట్టింగ్, ఆన్లైన్ జూదానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ స్పందించారు. తనపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆరోపణలపై వివరాలు ఇవ్వాలని రిజ్వాన్
విచారణకు హాజరైన సమయంలో తనపై ఉన్న ఆరోపణల గురించి పదేపదే వివరాలు అడిగినా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని రిజ్వాన్ సమర్పించిన సమాధానంలో పేర్కొన్నారు. తనపై ఏ సంఘటనకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయో తెలియజేస్తే విచారణలో పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.










