ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన హింస, నిబంధనల ఉల్లంఘనలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సహా విద్యార్థి సంఘాల కార్యకలాపాలపై కోర్టు ప్రశ్నలు సంధించింది.
2026-27 విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విద్యార్థి సంఘాల తీరుపై తీవ్రంగా ప్రశ్నించింది. ఎన్నికలు లింగ్డో కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జరగాలని చెప్పే విద్యార్థి సంఘాలే ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు విద్యార్థులేనా అని ప్రశ్నించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వాహనాల ర్యాలీలపై ప్రశ్నలు
ఎన్నికల ప్రచార సమయంలో నార్త్ క్యాంపస్లో పెద్ద సంఖ్యలో వాహనాలతో ర్యాలీలు నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా హైకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. కొన్ని వాహనాలకు నంబర్ ప్లేట్లు కూడా లేవన్న ఆరోపణలపై కోర్టు వివరణ కోరింది.











