** (డాక్సిన్ టైమ్స్) జూలై 18
కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ బి. నరహరి నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసును ఛేదించాయి. కేసు వివరాలను డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు.











