కామారెడ్డి పట్టణంలోని తక్కడు బాట్ల విద్యానగర్ కాలనీలో ఫ్రెండ్స్ అసోసియేషన్ తమ 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పూజలో 100 మంది మహిళలు పాల్గొన్నారు. అర్చకులు శరత్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఫ్రెండ్స్ అసోసియేషన్ 28వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గణేష్ మండపం వద్ద కుంకుమ పూజలు నిర్వహించినట్లు అర్చకులు శరత్ శర్మ తెలిపారు. ఈ పూజలో పాల్గొన్న వారికి అష్ట ఆయురారోగ్యాలతో పాటు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు పాత అంజయ్య, గజవాడ రవి, నంగునూరు శేఖర్, శశిరేఖ, సునీత తదితరులు మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులమందరం కలిసి వినాయక పండుగను పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కుంకుమ పూజతో పాటు పలహారం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి అన్నప్రసాద వితరణ వంటివి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్, పాత సుదర్శన్, విగ్రహ దాత పాత అంజయ్య-లక్ష్మీ దంపతులు, అన్నదాత నంగునూరి నీరజ-శేఖర్ దంపతులు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అసోసియేషన్ సభ్యులు కృషి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











