‘జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్’ కార్యక్రమంలో బీజేపీ నేతలు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మరియు నిజాంబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి బాలాపూర్కు బయలుదేరే బస్సులను ప్రారంభించారు.
రాజేశ్వరరావు మాట్లాడుతూ, దేశ భద్రత, రాష్ట్ర శాంతి, హిందూ ధర్మ రక్షణకు ముప్పుగా మారుతున్న అక్రమ చొరబాట్లపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగ్లాదేశ్కు చెందిన రోహింగ్యా చొరబాటుదారులను తిరిగి పంపే వరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
వడ్డేపల్లి రాజేశ్వరరావు స్వయంగా బస్సులో ప్రయాణిస్తూ బాలాపూర్లో నిర్వహించనున్న ధర్మ రక్షణ సభకు బయలుదేరారు.

