తిరుపతి, 2 July
ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్పై రెండు రోజుల వర్క్ షాప్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. తాను స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మల వంటి వారి జీవితాల్లో పథకాల ద్వారా వచ్చిన మార్పును ఆయన వివరించారు.
ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్పై నిర్వహిస్తోన్న రెండు రోజుల వర్క్ షాప్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
తాను స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మల జీవన స్థితిగతులను సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా ఆ కుటుంబాలకు జరిగిన మేలును వర్క్ షాప్లో వెల్లడించారు. పేదల స్థితిగతులను మెరుగుపరిచేందుకు జీఎస్డీపీ, సీఏజీఆర్ గణాంకాలను బేరీజు వేసుకుని పాలన చేస్తున్నామని తెలిపారు.
తాను ఆర్థికశాస్త్రం చదివినా, ప్రజల నుంచే ఎక్కువగా నేర్చుకున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ వర్క్ షాప్కు ఆర్థిక, పరిపాలన వ్యవహారాల్లో ప్రముఖ నిపుణులు హాజరుకావడం సంతోషకరమని పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారి 2020 విజన్ రూపొందించినప్పుడు విమర్శలు ఎదుర్కొన్నానని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా దేశానికి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని భావించారని గుర్తుచేశారు. ఐటీతో ప్రపంచం కుగ్రామంగా మారిందని, ఐటీతో అభివృద్ధి సాధించవచ్చని బలంగా నమ్మానని, సర్వీస్ సెక్టార్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటే అభివృద్ధి జరుగుతుందని విశ్వసించి అందుకు అనుగుణంగా పనిచేశామని తెలిపారు.











