తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి, నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కేంద్ర స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కొత్త బోర్డులో ఆమెకు సభ్యురాలిగా అవకాశం లభించింది. ఈ బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న కొత్త సీబీఎఫ్సీ బోర్డును ప్రకటించింది. మొత్తం 18 మంది సభ్యులతో ఈ కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. సుప్రియ యార్లగడ్డతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు ఇందులో స్థానం కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
సుప్రియ యార్లగడ్డ తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్తోనూ ఆమెకు అనుబంధం ఉంది. ఇటీవల అదివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన డకాయిట్ చిత్ర నిర్మాణంతోనూ ఆమె పేరు వార్తల్లో నిలిచింది.











