బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టుకు టీ20 కెప్టెన్గా వ్యవహరిస్తున్న నిగర్ సుల్తానా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. ఈ నిర్ణయం బోర్డు అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
జపాన్ నుంచి ఈ నెల 15న బోర్డుకు ఈమెయిల్ ద్వారా నిగర్ సుల్తానా తన నిర్ణయాన్ని తెలియజేసినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆమె టీ20 క్రికెట్కు పూర్తిగా దూరమవడం లేదు. ఇకపై తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్పై మరింత దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
బోర్డుకు ముందస్తు సమాచారం లేదు
నిగర్ సుల్తానా నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మహిళా విభాగం చైర్మన్ రఫీకుల్ ఇస్లాం బాబు తెలిపారు. ఆసియా క్రీడలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం రావడం తమకు ఇబ్బందికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. టోర్నీ ముగిసిన తర్వాత నిగర్తో, బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.











