కడప, 12 September
జిల్లా రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఘనంగా స్వాగతం పలికి, శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
స్వామివారి ఆశీస్సులతో ప్రజాక్షేమానికి ప్రార్థన – తిరుమలలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ డాక్షిన్ టైమ్స్ . జిల్లా రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు ఘనంగా స్వాగతం పలికి, శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాసుడి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లోక కళ్యాణంతో పాటు రాజంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రతి ఇంట్లోనూ సంతోషం విలసిల్లేలా చూడాలని స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసేవలో మరింత ముందుకెళ్లే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు..











