జలధార - జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న తంగడంచ చెరువు అభివృద్ధి పనులను ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తంగడంచ చెరువు పరిధిలో జరుగుతున్న ఫీడర్ ఛానల్, నీటి ప్రవాహ మార్గాల అభివృద్ధి, చెరువు కట్టల బలోపేతం, నిల్వ సామర్థ్య పెంపు పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా, పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు నిరంతరం పనుల పర్యవేక్షణ చేస్తూ, ఎప్పటికప్పుడు పురోగతిని నివేదించాలని ఆదేశించారు.












