రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం వాహనాలు ఒకదానితో ఒకటి సంభాషించుకునేలా చేసే నూతన సాంకేతిక ప్రతిపాదనను ప్రారంభించింది. ఈ వ్యవస్థ వాహనాల మధ్య కీలక సమాచారాన్ని నిజ సమయంలో పంచుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.
ఈ ప్రతిపాదనలో భాగంగా, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, లారీలు, బస్సులు వంటి అన్ని రకాల వాహనాలు తమ వేగం, స్థానం, ప్రయాణ దిశ, బ్రేకింగ్ వంటి ముఖ్యమైన డేటాను నిరంతరం పంచుకుంటాయి. ఈ సమాచారం ఇతర వాహనాలకు తక్షణమే అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
దీని ముఖ్య ఉద్దేశ్యం, ప్రమాదాలు జరగకముందే డ్రైవర్లను అప్రమత్తం చేయడం. ఉదాహరణకు, ముందు వెళ్లే వాహనం ఆకస్మికంగా బ్రేక్ వేస్తే, వెనుక వస్తున్న వాహనానికి వెంటనే సమాచారం అంది, ఢీకొనడాన్ని నివారించవచ్చు.









