జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో జాతీయ రహదారి 44పై తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు, వీరిలో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 11 మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.












