నల్గొండ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడి, స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టింది.
ఉడిపి హోటల్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు వేగంగా వచ్చి మొదట ఒక స్కూటీని ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను కూడా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు అదుపుతప్పి బోల్తా పడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు, పారిశుధ్య కార్మికులు ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












