YSR Kadapa/Badvel (డాక్సిన్ టైమ్స్) జూలై 01
రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు వాతావరణ మార్పులు సవాల్గా మారాయి. ఎల్నినో గండం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించడంతో, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక పంట ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రాంతీయ వాతావరణం, నేల స్వభావం ఆధారంగా రైతులకు మార్గదర్శకాలు రూపొందించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముంగిట నిలిచిన రైతులకు వాతావరణ మార్పులు సవాల్ విసురుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అంతటా ‘ఎల్నినో’ గండం కమ్ముకునే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాల్లో తీవ్ర అస్థిరత వల్ల సుధీర్ఘ బెట్ట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.










