చిన్నమండెం / అన్నమయ్య జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూన్ 30
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో విస్తరించేందుకు రైతులకు అవగాహన పెంచాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై కేశాపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన చేసిన కలెక్టర్, రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు అందించే ప్రకృతి వ్యవసాయ విధానాలను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రైతులలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చిన్నమండెం మండలం కేశాపురం గ్రామంలో పీఎండీఎస్, విత్తన పెల్లెటైజేషన్ విధానాలపై నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.










