రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "రైతన్న మీకోసం" కార్యక్రమం జిల్లాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుపై అవగాహన కల్పించనున్నారు.
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం కలెక్టరేట్ లో "రైతన్న మీకోసం" కార్యక్రమ ప్రచార కరపత్రాలను అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ కార్యక్రమంలో భాగంగా లాభసాటి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులు, ఖరీఫ్ పంటల సాగు సూచనలు, విత్తనాలు-ఎరువుల లభ్యత, సహజ వ్యవసాయం, నీటి యాజమాన్యం, డ్రోన్ సాంకేతికత వంటి అంశాలపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారు. అలాగే, రైతుల సమస్యలను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.










