విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ, టిక్కెట్ల రీఫండ్పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల్లో రద్దు చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
విమానయాన సంస్థలు టిక్కెట్ బుకింగ్ తర్వాత 48 గంటల్లోపు రద్దు చేసుకునే ప్రయాణికులకు ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరాదని డీజీసీఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధన టిక్కెట్లలో మార్పులకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ట్రావెల్ ఏజెంట్లు లేదా వారి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసిన సందర్భాలలో, రీఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదేనని పేర్కొంది. ఈ మొత్తాన్ని 14 పని దినాలలోగా ప్రయాణికులకు చెల్లించాలని నిర్దేశించింది.











