
వైఎస్ఆర్ కడప జిల్లా జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 బెంచీల ద్వారా మొత్తం 92,091 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిష్కారాల ద్వారా కక్షిదారులకు రూ.22.11 కోట్లకు పైగా చెల్లించడం జరిగిందని వెల్లడించారు.


















