కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన నాని రాజు, 7319 నంబర్ గల ప్రైవేట్ ఆర్టీసీ బస్సును గత పది సంవత్సరాలుగా నడుపుతూ, నేడు వెలువడిన ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనను అభినందించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన ఈదులయ్య నాని రాజు, 7319 నంబర్ గల ప్రైవేట్ ఆర్టీసీ బస్సును గత పది సంవత్సరాలుగా నడుపుతూ, నేడు వెలువడిన ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భూంపల్లి గ్రామస్తులు ఆయనను అభినందించారు.
కుటుంబ నేపథ్యం
నాని రాజు నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఈదులయ్య, పద్మ నారాయణ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు జన్మించారు. అతి చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో, వారి ఆలనా పాలనా తల్లి ఈదులయ్య పద్మ చూసుకుంటూ జీవనం సాగించింది. కూలి పని చేస్తూ వచ్చిన డబ్బులతో కూతురు, కొడుకులను చదివించేది.
చదువును వదిలి కుటుంబానికి అండగా
తల్లి కూలి పని చేసి తనను, అక్కను చదివించడం కష్టమవుతుందని గ్రహించిన నాని, తన చదువును మధ్యలోనే ఆపేసి, అమ్మతో కలిసి రోజు కూలి పనికి వెళ్లేవాడు. అక్క చదువు కొనసాగించడానికి తోడ్పాటునందించాడు. చిన్న వయస్సులోనే ప్రైవేట్ స్కూల్ బస్సు నడపడం ప్రారంభించాడు.











