కామారెడ్డి, 2026-08-31
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ విక్టర్, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ విక్టర్ ముఖ్య అతిథిగా, డిప్యూటీ కలెక్టర్ శ్రీ రవి తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.












