నంద్యాల, జూన్ 30
పేద ప్రజలకు అండగా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసుకు నిదర్శనమని ఏపీ న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముగ్గురికి రూ. 5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పేద ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు 'నేనున్నాను' అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ముగ్గురికి 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.











