కామారెడ్డి, 2026-07-31
మరెడ్డి జిల్ల ేంద్రంలోని ప్రభుత్వ వైద్యశలలో చిిత్స పొందుతున్న ఇందిర (22) అనే మహిళు ఓ నెగిటివ్ ర్తం అవసరమైంది. ర్తనిధి ేంద్రలలో ఆ ర్తం లభించపోవడంతో, వరి ుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవదళ్ రష్ట్ర చైర్మన్, రెడ్ ్రస్ జిల్ల సమన్వయర్త డ్టర్ బలును సంప్రదించరు. వెంటనే స్పందించిన రిజర్వ్డ్ ఎస్సై సయి ప్రసన్న, రెయిన్బో ర్తనిధి ేంద్రంలో ర్తన్ని అందజేసి మహిళ ప్రణలు పడరు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఇందిర (22) అనే మహిళకు ఓ నెగిటివ్ రక్తం అవసరమైంది. రక్తనిధి కేంద్రాలలో ఆ రక్తం లభించకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించిన డాక్టర్ బాలు, రిజర్వ్డ్ ఎస్సై సాయి ప్రసన్నను సంప్రదించగా, ఆమె వెంటనే స్పందించి రెయిన్బో రక్తనిధి కేంద్రంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. దీంతో సకాలంలో రక్తం లభించి, మహిళ ప్రాణాలు నిలబడ్డాయి.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, ప్రజలను రక్షించే ఎస్సైగా ఉంటూనే, మహిళ ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన సాయి ప్రసన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సైఫ్, బట్టు భరద్వాజ్ లు పాల్గొన్నారు.










