ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) భారతదేశంలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన పథకంగా నిలిచింది. ప్రతి కుటుంబానికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో 2014లో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఈ పథకాన్ని లాంఛ్ చేసింది. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని కాగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఒక విశేషం. పథకం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే కోట్లాది ఖాతాలు తెరవడం ద్వారా ఇది గణనీయమైన ఆదరణ పొందింది, సరికొత్త రికార్డులను సృష్టించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే 50 కోట్లకు పైగా ఖాతాలు తెరవడంతో, జన్ ధన్ యోజన అపూర్వ విజయాన్ని సాధించింది. ఈ పథకం దేశంలోని విస్తృత జనాభాకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది.









