కమలాపురం (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 13
వైఎస్సార్ జిల్లా మండలం ఎర్రబల్లె కొత్తపల్లి గ్రామంలో స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బాత్రూం నిర్మాణం చేపడుతుండగా ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ, కర్రలతో పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
స్థల వివాదంతో రణరంగమైన ఎర్రబల్లె కొత్తపల్లి: కర్రల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు! డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ . వైఎస్సార్ జిల్లా మండలం ఎర్రబల్లె కొత్తపల్లి గ్రామంలో స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బాత్రూం నిర్మాణం చేపడుతుండగా ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ, కర్రలతో పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. బాధితుల కథనం ప్రకారం.. దళితులకు కేటాయించిన స్థలంలో నిర్మాణం చేస్తుండగా గ్రామానికి చెందిన మల్లేటి ప్రతాప్ రెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి, బొగ్గుల వెంకటేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, నరసింహారెడ్డిలు వచ్చి తమపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘర్షణలో దళిత వర్గానికి చెందిన జయరాజు, బాల నరసింహులు, ఓబులేసు, అజయ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, ఎదురుదాడిలో మరొక వర్గానికి చెందిన ముగ్గురికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు బాధితులను వెంటనే కడప రిమ్స్ (RIMS) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తూ, వివాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.











