కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురణల విభాగం ప్రచురించిన 16 పుస్తకాలను ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, డాక్టర్ ఎల్. మురుగన్ కూడా పాల్గొన్నారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, తమిళ సాహిత్యంలో రచయితల కృషిని అభినందించారు. ఈ పుస్తకాలు యువతను భారతీయ సంస్కృతితో అనుసంధానించడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. 'వందే మాతరం' గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీకి ఆయన నివాళులర్పించారు.
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, తమిళ సంస్కృతి విశిష్టతను కొనియాడారు. దేశాభివృద్ధి తో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రచురణల విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ భూపేంద్ర కైంతోలా మాట్లాడుతూ, విడుదలైన 14 తమిళ పుస్తకాలు అక్కడి సంస్కృతి, సంగీతం, వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ పుస్తకాలను కొనుగోలు చేసి చదవాలని ఆయన కోరారు.

